శివాజీ పుస్తకంపై రగడ.. నాలుక చీరేస్తానంటూ పబ్లిషర్కు శివసేన ఎమ్మెల్యే హెచ్చరిక
- శివాజీ మహారాజ్పై రాసిన పుస్తకంపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆగ్రహం
- పబ్లిషర్కు ఫోన్ చేసి హత్యకు గురైన రచయిత పన్సారే గతే నీకూ పడుతుందని హెచ్చరిక
- ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పబ్లిషర్.. రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
- గైక్వాడ్ చర్యను ఖండించిన ప్రతిపక్షాలు.. విచారణకు డిమాండ్
మహారాష్ట్రలో శివసేన ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, ఓ పుస్తక ప్రచురణకర్తకు ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్పై రాసిన ఓ పుస్తకం విషయంలో ప్రచురణకర్త ప్రశాంత్ అంబిని ఫోన్లో దుర్భాషలాడుతూ, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కమ్యూనిస్టు నేత, దివంగత గోవింద్ పన్సారే 38 ఏళ్ల క్రితం రాసిన 'శివాజీ కోన్ హోతా' (శివాజీ ఎవరు?) అనే మరాఠీ పుస్తకాన్ని కొల్హాపూర్కు చెందిన ప్రశాంత్ అంబి ప్రచురించి, నామమాత్రపు ధరకు పంపిణీ చేస్తున్నారు. ఈ పుస్తకం పేరులో 'ఛత్రపతి', 'మహారాజ్' వంటి గౌరవసూచకాలు లేకపోవడంపై ఎమ్మెల్యే గైక్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 22న అర్ధరాత్రి దాటాక తనకు ఫోన్ చేసి "నీ నాలుక కోస్తా.. ఇంట్లోకి వచ్చి కొడతా.. నీకు కూడా రచయిత పన్సారే గతే పడుతుంది" అని గైక్వాడ్ బెదిరించినట్లు అంబి ఆరోపించారు. ఈ బెదిరింపులతో తన కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురైందని చెబుతూ, కొల్హాపూర్లోని రాజారాంపురి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. గైక్వాడ్పై కేసు నమోదు చేసి, తమకు రక్షణ కల్పించాలని కోరారు. కాగా, 2015లో గోవింద్ పన్సారే మార్నింగ్ వాక్ చేస్తుండగా హత్యకు గురయ్యారు.
ఈ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే గైక్వాడ్ ఆ ఆడియో క్లిప్లోని గొంతు తనదేనని అంగీకరించారు. అయితే, దానిని ఎడిట్ చేసి వక్రీకరించారని ఆరోపించారు. శివాజీని అవమానించేలా ఉన్న పుస్తకాన్ని నాశనం చేయాలని, ప్రచురణకర్త అహంకారంగా మాట్లాడారని ఆయన అన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇది "బహిరంగ గూండాయిజం" అని, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే గైక్వాడ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో ఆయన వార్తల్లో నిలిచారు.
కమ్యూనిస్టు నేత, దివంగత గోవింద్ పన్సారే 38 ఏళ్ల క్రితం రాసిన 'శివాజీ కోన్ హోతా' (శివాజీ ఎవరు?) అనే మరాఠీ పుస్తకాన్ని కొల్హాపూర్కు చెందిన ప్రశాంత్ అంబి ప్రచురించి, నామమాత్రపు ధరకు పంపిణీ చేస్తున్నారు. ఈ పుస్తకం పేరులో 'ఛత్రపతి', 'మహారాజ్' వంటి గౌరవసూచకాలు లేకపోవడంపై ఎమ్మెల్యే గైక్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 22న అర్ధరాత్రి దాటాక తనకు ఫోన్ చేసి "నీ నాలుక కోస్తా.. ఇంట్లోకి వచ్చి కొడతా.. నీకు కూడా రచయిత పన్సారే గతే పడుతుంది" అని గైక్వాడ్ బెదిరించినట్లు అంబి ఆరోపించారు. ఈ బెదిరింపులతో తన కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురైందని చెబుతూ, కొల్హాపూర్లోని రాజారాంపురి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. గైక్వాడ్పై కేసు నమోదు చేసి, తమకు రక్షణ కల్పించాలని కోరారు. కాగా, 2015లో గోవింద్ పన్సారే మార్నింగ్ వాక్ చేస్తుండగా హత్యకు గురయ్యారు.
ఈ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే గైక్వాడ్ ఆ ఆడియో క్లిప్లోని గొంతు తనదేనని అంగీకరించారు. అయితే, దానిని ఎడిట్ చేసి వక్రీకరించారని ఆరోపించారు. శివాజీని అవమానించేలా ఉన్న పుస్తకాన్ని నాశనం చేయాలని, ప్రచురణకర్త అహంకారంగా మాట్లాడారని ఆయన అన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇది "బహిరంగ గూండాయిజం" అని, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే గైక్వాడ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో ఆయన వార్తల్లో నిలిచారు.